యాప్నగరం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి. సింహాచలం నుంచి బరంపురం వెళుతుండగా ప్రమాదం. మృతులు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు.. మృతుల్లో చంటిపాపతో పాటూ ఇద్దరు మహిళలు.

Samayam Telugu 4 Jan 2020, 9:32 am
శ్రీకాకుళం జిల్లాలో ఘోరో ప్రమాదం జరిగింది. మందన మండలం కొత్తపల్లి సమీపంలో.. ఓ కారు మహేంద్రతనయ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురి చనిపోగా.. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మృతులు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు.. మృతుల్లో చంటిపాపతో పాటూ ఇద్దరు మహిళలు ఉన్నారు.
Samayam Telugu sklm.


Read Also: విహారయాత్రలో విషాదం.. లోయలో పడ్డ ఏపీ బస్సు.. విద్యార్థి మృతి, 35మందికి గాయాలు

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మాత్రమే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీరు విశాఖపట్నం జిల్లా సింహాచలం నుంచి బరంపురం వెళ్తుండగా ఘటన జరిగింది. అప్పన్నను దర్శించుకొని తిరిగి తమ సొంత ఊరికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందా.. డ్రైవర్ ఏమైనా నిద్ర మత్తులో ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.