యాప్నగరం

చిత్తూరు: తల్లీబిడ్డ ఆత్మహత్య.. చాకచక్యంగా తప్పించుకున్న బాలుడు

భర్తపై కోపంతో శుక్రవారం సాయంత్రం మనస్తాపం చెందిన కృష్ణవేణి ఇద్దరి పిల్లలను తీసుకుని గ్రామం సమీపంలో ఉన్న దేవళంగుట్టపైకి వెళ్లింది. ఇద్దరి పిల్లలను చీరకొంగుకు చుట్టుకుని కోనేటిలో దూకేందుకు ప్రయత్నించింది.

Samayam Telugu 26 Sep 2020, 8:01 am
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఊటబావులపల్లెలకు చెందిన సురేష్‌, కృష్ణవేణి భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు వరుణ్‌తేజ్‌, హర్షిత. కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్తపై కోపంతో శుక్రవారం సాయంత్రం మనస్తాపం చెందిన కృష్ణవేణి ఇద్దరి పిల్లలను తీసుకుని గ్రామం సమీపంలో ఉన్న దేవళంగుట్టపైకి వెళ్లింది. ఇద్దరి పిల్లలను చీరకొంగుకు చుట్టుకుని కోనేటిలో దూకేందుకు ప్రయత్నించింది.
Samayam Telugu చిత్తూరు జిల్లా ఆత్మహత్య


కుమారుడు వరుణ్‌తేజ్‌ తల్లి నుంచి విడిపించుకుని గుట్టపై నుంచి కేకలు వేస్తూ తన తాత దగ్గరకు వెళ్లాడు. అమ్మ, కూతురు కోనేటిలో దూకుతున్నారు అని కేకలు వేశాడు. స్థానికులను, మనవడిని వెంటబెట్టుకొని ఆయన కోనేటి దగ్గరకు వెళ్లేసరికి అప్పటికే కృష్ణవేణి తన కుమార్తెతో సహా కోనేటిలో చనిపోయి పైకి తేలారు. తల్లిబిడ్డ మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.. కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.