యాప్నగరం

కృష్ణా: కాల్వలోకి దూసుకెళ్లినకారు.. తల్లిబిడ్డ మృతి

కృష్ణాజిల్లాలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ కారు అదుపు తప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అవనిగడ్డకు చెందిన తల్లి బిడ్డ చనిపోయారు.

Samayam Telugu 4 Aug 2020, 10:34 am
కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనమలూరు విజయవాడ - అవనిగడ్డ కరకట్టపై చోడవరం దగ్గర అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ కారు అదుపు తప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అవనిగడ్డకు చెందిన తల్లి బిడ్డ చనిపోయారు. తండ్రి, చిన్నకుమారుడు ప్రాణాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu ప్రమాదంలో తల్లి, కొడుకులు మృతి


కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి ఈ కుటుంబం కారులో బయల్దేరింది. వీరు ప్రయాణిస్తున్న కారు అవనిగడ్డ-విజయవాడ కృష్ణా కరకట్టపై అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. తల్లి, బిడ్డ మరణంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.