యాప్నగరం

కడప: రాయచోటి వద్ద ఘోర ప్రమాదం.. తల్లీకుమారులు మృతి

కడప-తిరుపతి జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఐషర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 14 Jun 2020, 10:52 am
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడ్డారు. కడప జిల్లా రాయచోటి వద్ద ఎదురుగా వస్తున్న కారు, ఐషర్ వాహనం ఒకదానికొకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తల్లి, ఇద్దరు కుమారులు బెంగళూరు నుంచి నెల్లూరుకు కారులో వస్తుండగా.. రాయచోటి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరిలో ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
Samayam Telugu కడప రోడ్డు ప్రమాదం
Road Accident in Kadapa


గాయపడిన మరో వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన తల్లీకుమారుల్ని లక్ష్మీ, కార్తీక్‌రెడ్డిగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వ్యక్తిని సందీప్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాదం గురించి స్థానికుల సమాచారం అందజేయడంతో హుటాహుటీన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం హాస్పిటల్‌‌కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి కారణమైన ఐషర్ వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ప్రమాదం గురించి కుటుంబసభ్యులకు సమాచారం అందజేసిన పోలీసులు.. మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. తిరుపతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సందీప్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.