యాప్నగరం

నెల్లూరులో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

ఇద్దరు కొడుకులకు విషమిచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి. కోట మండలం ఊనుగుంటపాలెంలో ఘటన. కుటుంబ కలహాలే కారణమని అనుమానాలు.

Samayam Telugu 22 Feb 2020, 2:17 pm
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కోట మండలం ఊనుగుంటపాలెంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారు రాణి(23), చిన్నారులు ప్రదీప్‌ (5), సుధీర్‌ (2)లుగా గుర్తించారు. శనివారం ఉదయం ముగ్గురు మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu nlr


మహిళ కుటుంబల కలహాలతోనే ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఒకే ఇంట్లో ముగ్గురు ఇలా చనిపోవడం స్థానికంగా కలకలంరేపింది.. తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.