యాప్నగరం

నెల్లూరు: కొడుకు మరణం, అరగంటకే తల్లి ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టించే విషాదం

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో నాగరాజు అనారోగ్యంతో చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Samayam Telugu 1 Jul 2020, 8:10 am
నెల్లూరులో దారుణం జరిగింది.. అనారోగ్యంతో కొడుకు చనిపోగా.. అరగంటకే తల్లి ప్రాణాలు తీసుకుంది. బీవీ నగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సుబ్రహ్మణ్యం, పద్మజలకు ఒక్క కుమారుడు. అతడికి పెళ్లి కాలేదు.. రెండేళ్లుగా మతిస్థిమితం కూడా లేదు.. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో నాగరాజు అనారోగ్యంతో చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఇక లేడని తెలిసి కుమిలిపోయారు.
Samayam Telugu నెల్లూరులో విషాదం


కరోనా భయంతో బంధువులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. కనీసం పరామర్శించడానికి రాని పరిస్థితి. అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికంగా ఉండే వారితో మాట్లాడాదమని సుబ్రహ్మణ్యం వెళ్లారు. కొడుకు మరణాన్ని జీర్చించుకోలేని తల్లి పద్మజ ఇంట్లో నైలాన్‌ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొడుకు చనిపోయిన అరగంటకే తల్లికూడా చనిపోవడం విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు. అటు కొడుకు, ఇటు భార్య చనిపోవడంతో సుబ్రహ్మణ్యం తట్టుకోలేకపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.