యాప్నగరం

అదే జరిగితే ఏపీలో రాజ్యాంగ సంక్షోభం.. రాయలసీమ ప్రజలకు ఆ రెండు ఆప్షన్స్ ఇవ్వాలి: రఘురామ

Mp Raghu Rama మూడు రాజధానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమవాసులకు రెండు ఆప్షన్‌లు ఇచ్చి.. అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్సార్‌సీపీ నేతలు పదే, పదే అదే అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. వీరి మాటలతో ఓటింగ్ శాతం పెరిగి వై నాట్ 175 సాధ్యం అవుతుందా అన్నారు. నోటికొచ్చినట్లు అనవసరంగా చెత్త మాట్లాడితే అది తిరిగి తమ పార్టీకే రివర్స్ అవుతుంది అని అభిప్రాయపడ్డారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 18 Jan 2023, 6:43 am

ప్రధానాంశాలు:

  • ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
  • రాయలసీమవాసులకు రెండు ఆప్షన్‌లివ్వాలి
  • రాజ్యాంగ సంక్షోభం వస్తుందని హెచ్చరించారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Raghu Rama Krishnam Raju
రాయలసీమ ప్రజలకు కర్నూల్లో హైకోర్టు కావాలా?, సాగునీటి ప్రాజెక్టులు కావాలా అని ఓటింగు పెట్టాలని సూచించారు నర్సాపురం రఘురామ కృష్ణరాజు. గాలేరు, నగరి, హంద్రీనివా, వెలిగొండ ప్రాజెక్ట్, డ్రిప్ ఇరిగేషన్ కావాలా?, లేకపోతే రాయలసీమలో హైకోర్టు కావాలా అని అడిగితే రాయలసీమ ప్రజలు తమ మనోభావాలను వెల్లడిస్తారని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 58 వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారని మనమే గతంలో పేర్కొన్నామని, కానీ తాము అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామన్నారు. మూడు రాజధానులు అని చెప్పిన తమ పార్టీ నాయకులు పూటకో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అని చెప్పిన మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ఇప్పుడు విశాఖనే రాజధానిగా కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు.
సేవా తత్పరత ఉన్న వారికే ప్రజలు ఓటు వేస్తారని.. గత చరిత్ర ఈ విషయాన్ని రుజువు చేసిందన్నారు. మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధిని ప్రజలు గెలిపించారన్నారు. అలాగే బ్రహ్మచారిగా ఉన్న వాజపేయిని గెలిపించారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని అందుకని తమకు ఓటు వేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ పార్టీ వారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుని, ఆయన వివాహాలను చేసుకున్నారని.. నోటికొచ్చినట్లు అనవసరంగా చెత్త మాట్లాడితే అది మనకే రివర్స్ అవుతుందన్నారు. ఓటు వేయడానికి, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) విశాఖ రాజధానిగా పరిపాలన చేపడితే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందన్నారు రఘురామ. సుప్రీం కోర్టు, న్యాయ వ్యవస్థను దిక్కరించినట్లు అవుతుందని.. సీఎస్, డీజీపీలు సచివాలయం ఉన్నచోట ఉంటే, ముఖ్యమంత్రి మాత్రం విశాఖకు వెళ్ళిపోతారట అని విమర్శించారు. ఏప్రిల్ నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన చేస్తామని మంత్రులు, తమ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. అర్థంపర్థం లేని మాటలను తమ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని.. ఇలా మాట్లాడితే ఓటింగ్ శాతం పెరిగి వై నాట్ 175 సాధ్యం అవుతుందా అని అన్నారు. చేసేదే చెప్పాలని, చెప్పేదే చేయాలని.. అంతే కానీ కొన్ని కథనాలు చూసి ప్రజలు మోసపోతే మోసపోయి ఉండవచ్చు కానీ మళ్లీ మోసపోవద్దు అన్నారు.


రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.