యాప్నగరం

ఎన్టీఆర్ వర్సటీకి వైఎస్సాఆర్ పేరు ఎలా పెడతారు: ఎంపీ రఘురామకృష్ణరాజు

Ntr Health University: ఎన్టీఆర్ హెల్త్ వర్సటీ పేరు మార్పుపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వర్సటీకి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సాఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి ఎలా పెడతారని ఆయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ సర్కారు తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ (Ap Assembly)లో డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 21 Sep 2022, 7:34 pm

ప్రధానాంశాలు:

  • ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరెలా మారుస్తారన్న ఎంపీ రఘురామ
  • వర్సటీతో వైఎస్సాఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్న
  • సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపాటు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu raghu rama new.
రఘురామ కృష్ణ రాజు
Ntr Health University: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు (Ntr Health University) మార్పుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వర్సిటీ పేరు మార్పును వైఎస్సార్‌సీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krisharaju) తప్పుబట్టారు. వర్సటీకి ఏ మాత్రం సంబంధం లేని వైఎస్సార్ (YS Rajashekar Reddy) పేరును ఎలా పెడతారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు ఏ సంస్థకు తన పేరు పెట్టుకోలేదన్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ అబద్ధాలు మాట్లాడటం సమంజసం కాదన్నారు. జగన్ సర్కారు తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రఘురామ దుయ్యబట్టారు.
బిల్లుకు ఆమోదం..
ఏపీ అసెంబ్లీ (Ap Assembly)లో డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం లభించింది. యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెడుతూ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు.

ఎన్టీఆర్ అంటే కోపం లేదు..
ఎన్టీఆర్ అంటే తనకు ఎలాంటి కోపం లేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్టీఆర్‌ మీద తనకు ఆప్యాయతే ఉందని.. ఆయన్ని అగౌరవ పరిచే కార్యక్రమం తన తరపున ఏనాడూ జరగదన్నారు. ఏ రోజు ఎన్టీఆర్‌ను ఒక్క మాట అనలేదని.. పైగా పాదయాత్రలో ఇచ్చిన హామీ కింద ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే.. దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తామన్నారు.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అని జగన్ అన్నారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించారని.. ప్రాణం విలువ తెలిసిన డాక్టర్‌ అన్నారు. వైద్య రంగంలో సంస్కరణలకర్త అని.. పేదవాడి సమస్యలు, జీవితాలు అర్థం చేసుకున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశం మొత్తం ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుందన్నారు.

టీడీపీ ఆందోళన
అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై టీడీపీ ఆందోళన చేసింది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. పేపర్లు చింపి స్పీకర్‌పై విసిరారు.. ఈ గందరగోళం మధ్య తమ్మినేని సభను వాయిదా వేశారు. కొద్దిసేపటి తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు.
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.