యాప్నగరం

మోదీకి రఘురామ కృష్ణం రాజు మరో షాకింగ్ లేఖ

Narasapuram MP: రఘురామ కృష్ణం రాజు ప్రవర్తనతో ఆయనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్‌, ప్రసాద్‌ రాజు ఫిర్యాదులు చేసినవారిలో ఉన్నారు.

Samayam Telugu 9 Jul 2020, 11:15 pm
ప్రధాని నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరో లేఖ రాశారు. దేశంలో లాక్ డౌన్ కాలంలో 81 కోట్ల మంది పేద ప్రజల ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. అంతేకాక, పలు విషయాల్లోనూ ప్రధాని మోదీపై రఘురామ కృష్ణం రాజు ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి రూ.లక్ష కోట్లు కేటాయించడంపైనా ప్రధానికి రఘురామ కృష్ణం రాజు కృతజ్ఞతలు తెలిపారు. పీఎం ఆవాస్‌ యోజన ద్వారా వలస కూలీలకు అండగా నిలిచారని కొనియాడారు. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన నవంబరు వరకు పొడిగించడం గురించి కూడా రఘురామ కృష్ణం రాజు ప్రస్తావించారు.
Samayam Telugu రఘురామ కృష్ణం రాజు, మోదీ
Raghurama krishnam raju


మరోవైపు, రఘురామ కృష్ణం రాజు ప్రవర్తనతో ఆయనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్‌, ప్రసాద్‌ రాజు ఫిర్యాదులు చేసినవారిలో ఉన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, నరసాపురంలో ప్రసాద్‌ రాజు కంప్లైంట్ ఇచ్చారు. బుధవారం గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు కూడా ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Also Read: undefined

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న ఇళ్ల పథకంలో స్థలాల కేటాయింపులో అక్రమాలు, కొనుగోళ్లలో కూడా గోల్‌మాల్‌ జరుగుతోందని రఘురామ కృష్ణం రాజు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్లా వేళ్లా పడి బతిమాలితేనే తాను పార్టీలో చేరానని మరోసారి అన్నారు. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. దీంతో రఘురామ కృష్ణం రాజుపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.