యాప్నగరం

YSRCP ఎంపీపై అభ్యంతరకర పోస్ట్.. సీఎస్‌ సాహ్నీకి ఫిర్యాదు చేస్తూ లేఖ

సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయన పోస్టు చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో కీలకశాఖలో ఉంటూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 12 Aug 2020, 2:00 pm
ఏపీ సీఎస్ నీలం సాహ్నీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. ఐఅండ్‌పీఆర్‌లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయన పోస్టు చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో కీలకశాఖలో ఉంటూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్టులపై విచారణ జరిపించి దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో తాను పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాను అన్నారు.
Samayam Telugu వైసీపీ ఎంపీ


రఘురామ రాసిన లేఖపై సీఎస్ నీలం సాహ్నీ ఎలా స్పందిస్తారు.. ఆయనపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దేవేందర్ రెడ్డి ఏం పోస్టు పెట్టారు.. రఘురామ ఎందుకు అభ్యంతరం తెలిపారన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాదు నర్సాపురం ఎంపీ ఇటీవల సీఎం వైఎస్ జగన్‌కు వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.