యాప్నగరం

RRR: రాబోయే విజయదశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారు: రఘురామ

RRR: చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ.. అనేక చర్చలకు దారి తీసింది. ముఖ్యంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం సాగుతున్న వేళ.. వీరిద్దరు సమావేశం కావడం చర్చనీయాంశం అయ్యింది. బాబు-పవన్ భేటీపై ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే విజయదశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ట్వీట్ చేశారు. దీంతో ఏపీలో ముందస్తు ఖాయం అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ-జనసేన పొత్తు కూడా ఖాయం అనే ప్రచారం సాగుతోంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 8 Jan 2023, 7:57 pm

ప్రధానాంశాలు:

  • ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు
  • విజయదశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ట్వీట్
  • పవన్-బాబు భేటీని స్వాగతించిన రఘురామకృష్ణరాజు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Raghurama Krishnam Raju
రఘురామకృష్ణరాజు
RRR: ఎముకలు కొరికే చలిలో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. అందుకు కారణమైంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ. వీరిద్దరు హైదరాబాద్‌లో భేటీ అయితే.. దాని రియాక్షన్ ఏపీలో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ భేటీపై చాలామంది నేతలు ఘాటుగా స్పందించారు. తాజాగా.. పవన్-బాబు భేటీ కీలక ట్వీట్ చేశారు ఎంపీ రఘురామకృష్ణ రాజు. 'చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలుపడం శుభపరిణామం. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ఫాసిస్ట్ జీవోలపై సమిష్టి పోరాటం అత్యవసరం. రాబోయే విజయదశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. దుష్ట శిక్షణ తథ్యం. మంచి రోజులు వస్తున్నాయి' అని ఎంపీ రఘురామ (Raghurama Krishnam Raju) వ్యాఖ్యానించారు.
రఘురామ ట్వీట్‌లో ముందస్తు ఎన్నికల ప్రస్తావన లేదు. కానీ.. ఆ అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. విజయదశమి అక్టోబర్ నెలలో వస్తుంది. అయితే.. ఏపీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం.. 2024 మే నెలలో జరగాలి. కానీ.. రఘురామ విజయదశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ట్వీట్ చేశారు. అంటే.. 2023 అక్టోబర్ లోపే ఎన్నికలు జరుగుతాయని ఆయన పరోక్షంగా చెప్పారు. దీంతో ఏపీలో కొత్త చర్చ మొదలైంది. అలాగే.. ఆయన టీడీపీ-జనసేన (Janasena-TDP) పొత్తు పెట్టుకోవచ్చు అనే యాంగిల్‌లో ట్వీట్ చేశారు. అటు చంద్రబాబు కూడా ఇదే అర్థం వచ్చేలా మాట్లాడారు. కానీ.. పవన్ మాత్రం పొత్తులపై ఎలాంటి కామెంట్ చేయలేదు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.