యాప్నగరం

జగన్‌ను, వైసీపీని వదలను.. రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

తన మీద జరుగుతున్న కుట్రల గురించి జగన్‌కు తెలియదు అనుకున్నానని.. కానీ విమానం ఏర్పాటు చేశారంటే తన మీద కుట్రలు జగన్‌కు తెలిసే జరుగుతున్నాయి అనుకుంటున్నాను అన్నారు.

Samayam Telugu 3 Jul 2020, 7:37 am
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ వైఎస్సార్‌సీపీలో హీట్ పెంచింది. శుక్రవారం ఆ పార్టీ ఎంపీలు రఘురామపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అనర్హత వేటు వేయాలని కోరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆయన కూడా స్పందించారు. ప్రపంచమంతా ఏకమైనా తన పదవిని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. లోక్‌సభ స్పీకర్ చాలా మంచివారని.. నిబంధనల మేరకు నడుచుకుంటారంటున్నారు.
Samayam Telugu ఎంపీ రఘురామ


తన మీద జరుగుతున్న కుట్రల గురించి జగన్‌కు తెలియదు అనుకున్నానని.. కానీ విమానం ఏర్పాటు చేశారంటే తన మీద కుట్రలు జగన్‌కు తెలిసే జరుగుతున్నాయి అనుకుంటున్నాను అన్నారు. పార్టీపై మమకారం ఉందని.. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే పద్దతి అది కాదని.. తనకు సరైన పద్దతిలో షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం ఇస్తాను అంటున్నారు. వైఎస్సార్‌సీపీని, జగన్‌‌ను వదిలేది లేదంటున్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో ఏదో షో చేయాలనుకుంటున్నారని రఘురామ అంటున్నారు. ప్రభుత్వ విమానం ఖాళీగా ఉంది.. వైసీపీ ఎంపీలు తిరుగుతున్నారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఏమీ ఉండదన్నారు. ప్రభుత్వ విమానంలో ఢిల్లీలో వెళ్లి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడమేంటి?. మెయిల్ ద్వారా పంపొచ్చు.. ఏదో షో చేసుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు ఢిల్లీ వెళ్లిన ఖర్చును పార్టీ ఖర్చులో రాస్తారో.. ప్రభుత్వం ఖర్చులో రాస్తారో చూడాలి. తాను జగన్‌కు గౌరవం ఇస్తున్నానని.. పార్టీ పల్లెత్తు మాట అనలేదన్నారు. ఢిల్లీలో ఏం జరగబోతుందో తాను గమనిస్తున్నాను అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.