యాప్నగరం

నా సవాల్ స్వీకరించే దమ్ము వైసీపీకి లేదు.. సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలు. 110 తప్పులు చేశారంటూ మండిపడ్డ బీజేపీ ఎంపీ. అమరావతి భూములపై సవాల్ ఏమైందని ప్రశ్న.

Samayam Telugu 7 Sep 2019, 9:59 pm
అమరావతి భూములపై తన సవాల్‌ను స్వీకరించే దమ్ము వైసీపీకి లేదన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. తాను చేసిన ఛాలెంజ్‌పై ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. అమరావతిలో అవినీతి అన్నారని.. ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. అమరావతిని గోస్ట్‌ సిటీలా తయారు చేశారని మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన సుజనా.. చంద్రబాబు, జగన్‌ ప్రభుత్వాలు దొందూ దొందేనని.. జగన్ సర్కార్ 100 రోజుల పాలనతో జనాలకు ఒరిగిందేమీ లేదంటున్నారు.
Samayam Telugu sujana


జగన్ వంద రోజుల పాలనలో 110 తప్పులు చేశారన్నారు సుజనా. ఫించన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, సన్న బియ్యం ఎలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సరిగా అమలు చేయలేదని విమర్శించారు. 4 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్నారని.. వాలంటీర్ల పోస్టులు మొత్తం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకే కట్టబెట్టారన్నారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు అంశం కూడా పక్కన పెట్టారన్నారు. కీలకమైన పోస్టులు ఒకే సామాజిక వర్గానికే ఇస్తున్నారని.. రాష్ట్రంలో వంద రోజులుగా అన్యమత ప్రచారం ఎక్కువైందన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ అర్థాంతరంగా నిలిపివేశారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ. ఇంకా ప్రత్యేకహోదాపై రాజీలేని పోరాటం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని.. ఉన్న పోర్టులు రద్దు చేస్తే కొత్త పోర్టులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం స్థానికులకు ఉద్యోగాలు సాధ్యం కాదని.. స్థానికులకు ఉద్యోగాలంటే ఉన్న పరిశ్రమలు తరలిపోతాయన్నారు. వంద రోజుల్లో చాలా మంది పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారన్నారు. వంద రోజుల్లో అమరావతి, పోలవరం పనులు నిలిపివేయడం.. విద్యుత్ ఒప్పందాల రద్దు చేయడం జగన్ సర్కార్ విజయమా అంటూ ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.