యాప్నగరం

అరెస్ట్ భయంతో కరకట్టకు పారిపోయి వచ్చారు.. బాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

కేసులో అరెస్టు భయంతోనే కరకట్టకు పారిపోయి వచ్చారని గుసగుసలు. ‘వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు’ సామెత ఇలాంటి వారి కోసమే పుట్టి ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు.

Samayam Telugu 13 Oct 2020, 12:32 pm
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు భయంతో అమరావతి పారిపోయి వచ్చారంటూ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసులో అరెస్టు భయంతోనే కరకట్టకు పారిపోయి వచ్చారని గుసగుసలు. ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అనే వాయిస్ తనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు తేల్చాయి. సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయంట. ‘వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు’ సామెత ఇలాంటి వారి కోసమే పుట్టి ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు.
Samayam Telugu చంద్రబాబు


అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి శోకాలు తప్ప ప్రజల కోసం ఏనాడైనా నోరు విప్పారా బాబూ! అంటూ మరో ట్వీట్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ. ఎప్పుడో ఒకసారి సందర్శకుల్లా వచ్చి రెచ్చగొట్టే స్పీచులు దంచిపోవడమే.. ప్రజా సేవ అనుకుంటే ఎలా? జీతభత్యాలు తీసుకుంటున్నందుకైనా రాష్ట్రానికి పనికొచ్చే సలహాలు ఇవ్వండి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.