యాప్నగరం

'Chandrababu Naiduకు భయం మొదలయ్యింది.. అందుకే ఇలా..'

లులూ గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం పట్టుకుందని.. అందుకే సుజనాను రంగంలోకి దించారని విమర్శలు.

Samayam Telugu 23 Nov 2019, 11:03 am
టీడీపీ నేతలు, అధినేత చంద్రబాబుపై ట్విట్టర్‌లో మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. లులూ గ్రూప్ విశాఖ నుంచి వెళ్లిపోవడానికి.. ఏపీలో పెట్టుబడులు పెట్టమని చెప్పడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. లులూ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే తెగ గుండెలు బాదుకుంటున్నారని.. బాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఎక్కడ పోతుందనే భయం పట్టుకుందని విమర్శించారు.
Samayam Telugu babu


Read Also: YS Jagan ఆరు నెలల పాలన.. ఆరు మాటల్లో.

లులూ గ్రూప్ కు వైజాగ్ నడిబొడ్డున 14 ఎకరాల భూమిని చంద్రబాబు ఉదారంగా కట్టబెట్టారని ఆరోపించారు. దీనికి ఎంత కమిషన్ ముట్టిందో త్వరలోనే బయటపడుతుందన్నారు. వాళ్ల పెట్టుబడికి అంత భూమి అవసరం లేదని ప్రభుత్వం రద్దు చేసిందని.. దీనిపై లులూ సంస్థ కంటే చంద్రబాబే ఎక్కువ గుండెలు బాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.
తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బిజెపిలోకి పంపించిన ‘కోవర్టు’ను చంద్రబాబు రంగంలోకి దించారన్నారు. ప్రతిపక్ష హోదా ఎక్కడ జారిపోతుందో అని భయం పట్టుకుందని... అందుకే ‘కోవర్టు’ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బిజెపీతో టచ్ లో ఉన్నారని చెప్పించారని ఆరోపించారు. అబద్ధానికీ ఒక హద్దుండాలని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.