యాప్నగరం

'Chandrababu Naiduకు సలహాదారు కచ్చితంగా చిట్టి నాయుడే'

' అడ్డగోలుగా లూటీ చేస్తారు. అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తారు.. తర్వాత ఎల్లో మీడియో మొత్తం మోత మోగిపోతుంది' అంటూ చంద్రబాబుపై సెటైర్లు పేల్చిన విజయసాయిరెడ్డి.

Samayam Telugu 11 Jan 2020, 12:16 pm
మాజీ ముఖ్యమంత్రి. టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిరసనలు.. చంద్రబాబు జోలెపట్టడంపై విమర్శలు చేశారు. బాబును చూస్తే రాజు గారి దేవతా వస్త్రాల కథ గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. తన బాధను ప్రజల బాధగా చిత్రకరించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నారు.
Samayam Telugu cbn


చంద్రబాబు ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా.. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా ‘రాజు గారి దేవతా వస్త్రాల’ కథను గుర్తు కొస్తోంది అన్నారు. తుఫాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ అంటూ సెటైర్లు పేల్చారు.
చంద్రబాబు స్వభావం మొదటి నుంచి అంతే.. ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తారు. అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తారు. ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా సాగేది.. సోషల్ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.