యాప్నగరం

Anantapur: ఎమ్మార్పీఎస్ నేత దారుణ హత్య.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపి..

డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన అనంతపురంలో జరిగింది. హత్యానంతరం నిందితుడు పారిపోకుండా అక్కడే తాపీగా కూర్చోవడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు.

Samayam Telugu 30 Nov 2019, 5:53 pm
అనంతపురంలో దారుణ హత్య జరిగింది. ఎమ్మార్సీఎస్ నేతను ఓ వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. కిరాతకంగా హత్య చేసిన తరువాత కూడా ఏ మాత్రం భయం లేకుండా పోలీసులు వచ్చే వరకూ శవం దగ్గరే కూర్చున్న ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన పోలీసుల వద్ద నిందితుడు లొంగిపోయినట్లు సమాచారం.
Samayam Telugu anantapur


అనంతపురం పట్టణంలోని సప్తగిరి సర్కిల్ వద్ద దారుణ హత్య జరిగింది. ఎమ్మార్పీఎస్ నేత జగ్గు ప్రకాష్‌ను రమణ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా హత్య చేశాడు. విచక్షణా రహితంగా కత్తితో పొడవడంతో ప్రకాష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. హత్యానంతరం నిందితుడు రమణ పారిపోకుండా అక్కడే కూర్చోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Also Read: కర్నూలులో మానవ మృగం.. కన్నకూతురిపై అఘాయిత్యం..

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి రావడంతో స్పాట్‌లోనే రమణ లొంగిపోయినట్లు తెలుస్తోంది. పాతకక్షల నేపథ్యంలోనే ప్రకాష్‌ను హత్య జరిగినట్లు సమాచారం. మృతుడు ప్రకాష్ కొద్దికాలం క్రితం రమణ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని.. అందుకే హత్య చేసినట్లుగా చెబుతున్నారు. పట్టపగలు.. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

Read Also: సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం.. విజయవాడలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.