యాప్నగరం

జగన్‌కు నాగబాబు అభినందనలు... థాంక్యూ సీఎం అంటూ..

టీటీడీ ఆస్తుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో నిన్నమొన్నటి వరకు జగన్‌ను విమర్శించిన నాగబాబు సైతం టీటీడీ ఆస్తుల అమ్మకంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

Samayam Telugu 26 May 2020, 8:26 pm
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దీనిపై జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల అమ్మకాన్ని నిలివేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీటర్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. 'టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ యు సీఎం గారు' అని ట్వీట్‌ చేశారు.
Samayam Telugu జగన్ నాగబాబు


టీటీడీకి సంబంధించిన 50 ఆస్తుల అమ్మక నిర్ణయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉత్తర్వులు జారీచేశారు. పూర్తిగా చర్చించిన అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీటీడీ ఆస్తుల అమ్మకాలు జరపాలని 2016 జనవరి 30వ తేదీన జరిగిన సమావేశంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని టీటీడీ పున:పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

భక్తులను, మత పెద్దలను సంప్రదించి, ఆ ఆస్తులను దేవాలయాలకు, ధర్మ ప్రచారానికి టీటీడీ ఉపయోగించుకోవచ్చునేమో పరిశీలించాలని జిఓలో పేర్కొన్నారు. ఈ విషయమై తుది నిర్ణయం జరిగేవరకు సదరు 50 ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రతిపాదనను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.