యాప్నగరం

తమిళనాడు సీఎం ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రోజా

ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడి తన సానుభూతిని తెలియజేశారు. ఇటు తమిళనాడు సీఎంను ప్రముఖులు, పార్టీల ముఖ్య నేతలు పరామర్శించారు.

Samayam Telugu 21 Oct 2020, 7:41 am
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా పరామర్శించారు. సీఎం తల్లి తవసాయమ్మాల్ గతవారం అనారోగ్యంతో కన్నుమూశారు.. ఆమెకు నివాళులు అర్పించేందుకు భర్త ఆర్కే సెల్వమణితో కలసి రోజా పళనిస్వామి నివాసానికి వెళ్లారు. తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. పళనిస్వామితో మాట్లాడి తన సానుభూతిని తెలియజేశారు. ఇటు తమిళనాడు సీఎంను ప్రముఖులు, పార్టీల ముఖ్య నేతలు పరామర్శించారు. మంగళవారం ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, సినీ నటి, బీజేపీ నేత కుష్బూ, డీఎండీకే నేత సుధీప్‌, సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి పళనిస్వామిని కలిసి సానుభూతి తెలిపారు.
Samayam Telugu ఎమ్మెల్యే రోజా


పళనిస్వామి తల్లి తవసాయమ్మాల్‌ను అనారోగ్యం వెంటాడుతోంది. ఆమెకు ఇంటి దగ్గరే డాక్టర్ల వైద్యం అందిస్తున్నారు.. కానీ పదిరోజులు క్రితం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో సేలంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.. అక్కడ డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.