యాప్నగరం

Pawan Kalyan ఢిల్లీకి వెళ్లింది అందుకే.. ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ పెట్టిన పనన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని గెలిపించాలన్నారని.. వేరే పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేవాళ్లు పార్టీ ఎందుకు పెట్టారని రోజా ప్రశ్నించారు.

Samayam Telugu 24 Nov 2020, 2:24 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా. పవన్ హైదరాబాద్‌లో అమ్ముడుపోయి తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కూర్చున్నారని సెటైర్లు పేల్చారు. ఏపీలో జనసేన ఉనికి లేదని.. హైదరాబాద్‌లో పోటీ నుంచి తప్పుకున్నందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనకు సీటు కావాలని అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తిరుపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం అన్నారు. జనసేన పార్టీ పెట్టిన పనన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని గెలిపించాలన్నారని.. వేరే పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేవాళ్లు పార్టీ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.
Samayam Telugu పవన్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు


జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పుకుంటున్నాం.. ఎందుకంటే బీజేపీ గెలవాలి, టీఆర్ఎస్ గెలవకూడదని పవన్ వ్యాఖ్యలు చేశారని రోజా గుర్తు చేశారు. ఎవరు గెలిస్తే తమ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.. ఇవన్నీ చూస్తుంటే ప్రజల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. అక్కడ కేసీఆర్, జగన్‌ను ఎలాగైనా తొక్కేసి సీట్లు కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. బీజేపీకి తెలంగాణలో పట్టు ఉందేమో.. ఏపీలో అసలు సీటు వచ్చే పరిస్థితి లేదన్నారు. జగన్ పాలన చూసి తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.