ఆంధప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త శకానికి నాంది పలికింది జగన్ సర్కార్. సోమవారం నుంచి 13 జిల్లాలు కాస్త 26కు పెరిగాయి. నూతనంగా ఏర్పడిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చాయి.. ఈ క్రమంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు కావడంతో రాయలసీమకు సముద్రం వచ్చిందట. ఇదేం విచిత్రమని ఆశ్చపోతున్నారా.. మీరు వింటున్నది నిజమేనండీ బాబూ.. తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం కలిసింది. అలాగే సముద్రతీరంలో ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు కూడా తిరుపతి జిల్లాలో చేరింది. దీంతో రాయలసీమ పరిధిలో ఉన్న తిరుపతి జిల్లాకు సముద్రం వచ్చేసిందని చర్చ జరుగుతోంది. అంతేకాదు మరో మార్పు కూడా జరిగింది. ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది.
గుంటూరు ఉమ్మడి జిల్లాలో సముద్రతీరం ఉండేది.. విభజన తర్వాత సముద్ర తీరం దూరమైంది. బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరం ఉండేది. ఇప్పుడు సూర్యలంక బాపట్ల జిల్లాలోకి వెళ్లిపోయింది. దీంతో గుంటూరు జిల్లా తీరం లేని జిల్లాగా మారింది. రాయలసీమకు సముద్రం రావడంపై ఎమ్మెల్యే రోజా కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
‘ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాల పునర్ విభజనకు శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు. 26 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. పునర్వ్యవస్థీకరణలో సీమకు సముద్రం రావడం సంతోషంగా ఉంది’అంటూ ట్వీట్ చేశారు.
సీమకు సముద్రం రావడంపై తెలుగు తమ్ముళ్లు సెటైర్లు పేలుస్తున్నారు. ‘అంటే ఇప్పుడు జగన్ రెడ్డి సీమకు సముద్రం తెచ్చాడా😄నెల్లూరులోని మూడు నియోజకవర్గాలని.చిత్తూరులోని నాలుగు నియోజకవర్గాలని కలిపి ఈ జిల్లా చేశారు..దీన్ని సీమకు సముద్రమనే కాదు..కోస్తాకి తిరుపతి అని కూడా అనొచ్చు.అంతగా దాన్ని సీమ అని పిలవాలంటే.నెల్లూరు మూడిటినీ తప్పించి పిలవండి’అన్నారు.
అంతేకాదు రాష్ట్రంలో కొత్తగా గిరిజనుల కోసం రెండు జిల్లాలు ఏర్పాటయ్యాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్లో మన్యం జిల్లాగా ప్రకటించగా.. స్థానికుల సూచనలు, వినతితో పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చేశారు. మొత్తానికి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
గుంటూరు ఉమ్మడి జిల్లాలో సముద్రతీరం ఉండేది.. విభజన తర్వాత సముద్ర తీరం దూరమైంది. బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరం ఉండేది. ఇప్పుడు సూర్యలంక బాపట్ల జిల్లాలోకి వెళ్లిపోయింది. దీంతో గుంటూరు జిల్లా తీరం లేని జిల్లాగా మారింది. రాయలసీమకు సముద్రం రావడంపై ఎమ్మెల్యే రోజా కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
‘ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాల పునర్ విభజనకు శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు. 26 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. పునర్వ్యవస్థీకరణలో సీమకు సముద్రం రావడం సంతోషంగా ఉంది’అంటూ ట్వీట్ చేశారు.