యాప్నగరం

జగన్‌ను కలిసిన రోజా.. కేవలం ‘మర్యాదపూర్వక’మేనా..?

APIIC చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇది కేవలం మర్యాదపూర్వ భేటీ మాత్రమేనన్నారు.

Samayam Telugu 4 Nov 2019, 5:53 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో నగరి ఎమ్మెల్యే రోజా భేటీ అయ్యారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ఆమె సీఎంను కలిశారు. ముఖ్యమంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారని అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ సమస్యలను ఆమె సీఎం దృష్టికి తీసుకొచ్చారని ట్వీట్టర్ ద్వారా తెలిపారు. వైఎస్ఆర్సీపీ తరఫున కొన్నేళ్లుగా బలంగా గొంతుకను వినిపిస్తోన్న రోజాను జగన్ ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించారు.
Samayam Telugu nagari mla roja meets ap cm ys jagan in tadepalli
జగన్‌ను కలిసిన రోజా.. కేవలం ‘మర్యాదపూర్వక’మేనా..?


వాస్తవానికి రోజాకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ సామాజిక సమీకరణల కారణంగా ఆమెకు కేబినెట్ బెర్త్ దూరమైంది. దీంతో కొంత కాలంపాటు ఆమె అలకబూనారని వార్తలొచ్చాయి. రోజాను బుజ్జగించిన వైఎస్ఆర్సీపీ నేతలు.. చివరికి ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రకటన వెలువడినా.. ఉత్తర్వులు రావడం ఆలస్యం కావడంతో.. ఆమె బాధ్యతలు స్వీకరించడం కూడా ఆలస్యమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజా అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరిగింది. జగన్ సీఎం అయితే.. తామంతా ముఖ్యమంత్రులం అయినట్టేనని రోజా వ్యాఖ్యానించారు.

గత కొంత కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ.. ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న రోజా.. చాలా రోజుల విరామం తర్వాత సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.