యాప్నగరం

కలాం స్ఫూర్తిగా.. స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే రోజా పాఠాలు

ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి నివాళులు అర్పించి.. ఆయన దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు. అనంతరం 900మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను రోజా పంపిణీ చేశారు.

Samayam Telugu 15 Oct 2019, 5:58 pm
ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా టీచర్‌గా మారారు. స్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. నగరి రూరల్ ఎం. కొత్తూరులోని జిల్లా పరిషత్ స్కూల్‌లో జరిగిన భారత మాజీ రాష్ట్రపతి జయంతి వేడుకలకు రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలాం విగ్రహానికి నివాళులు అర్పించి.. ఆయన దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు. అనంతరం 900మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను రోజా పంపిణీ చేశారు.
Samayam Telugu roja


అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే రోజా పాఠాలు చెప్పారు. అబ్దుల్ కలాం గొప్పతం, చదువు ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు సందేశాన్నిచ్చారు. కలాం సూక్తులను చెప్పి జీవిత పాఠాల గురించి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా కలాం జయంతి వేడుకలకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.