ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా టీచర్గా మారారు. స్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. నగరి రూరల్ ఎం. కొత్తూరులోని జిల్లా పరిషత్ స్కూల్లో జరిగిన భారత మాజీ రాష్ట్రపతి జయంతి వేడుకలకు రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలాం విగ్రహానికి నివాళులు అర్పించి.. ఆయన దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు. అనంతరం 900మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను రోజా పంపిణీ చేశారు.
అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే రోజా పాఠాలు చెప్పారు. అబ్దుల్ కలాం గొప్పతం, చదువు ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు సందేశాన్నిచ్చారు. కలాం సూక్తులను చెప్పి జీవిత పాఠాల గురించి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా కలాం జయంతి వేడుకలకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.
అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే రోజా పాఠాలు చెప్పారు. అబ్దుల్ కలాం గొప్పతం, చదువు ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు సందేశాన్నిచ్చారు. కలాం సూక్తులను చెప్పి జీవిత పాఠాల గురించి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా కలాం జయంతి వేడుకలకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.