యాప్నగరం

వైసీపీ ఎంపీ చొరవ, స్పందించిన కేంద్రం.. అనంతపురం జిల్లావాసులకు తీపి కబురు

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ కృషితో సాధ్యమైంది. జిల్లావాసుల సమస్యను తెలుసుకునిఎంపీ మాధవ్ చొరవ తీసుకుని కేంద్రం, రైల్వేశాఖ అధికారులకు సమస్యను వివరించారు.. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Samayam Telugu 7 Dec 2020, 10:53 am
అనంతపురం జిల్లావాసులకు గుడ్‌న్యూస్.. కదిరి–అనంతపురం–గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు (06340) నడపడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ కృషితో సాధ్యమైంది. ఈ రైలు వారంలో నాలుగు రోజుల పాటు నాగర్‌ కోయిల్‌–ఛత్రపతి టెర్మినల్‌ మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర వారాల్లో నాగర్‌ కోయిల్‌లో బయలుదేరనున్న ఈ రైలు మదనపల్లె మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
Samayam Telugu అనంతపురం


కదిరి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణించి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌ చేరుకుంటుంది. తిరిగి మంగళ, బుధ, గురు, ఆదివారాల్లో ముంబై ఛత్రపతి టెర్మినల్‌లో బయలుదేరి జిల్లా మీదుగా వెళ్లనుంది. దీంతో తమిళనాడు, చిత్తూరు, పుణె తదితర ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రయాణికులకు రైలు అందుబాటులోకి వచ్చింది. జిల్లావాసుల సమస్యను తెలుసుకునిఎంపీ మాధవ్ చొరవ తీసుకుని కేంద్రం, రైల్వేశాఖ అధికారులకు సమస్యను వివరించారు.. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.