యాప్నగరం

వైఎస్ విజయమ్మ, షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ విజయమ్మ, షర్మిలకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 14న వీరిద్దరూ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

Samayam Telugu 31 Jan 2020, 11:09 am
ఏపీ సీఎం వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మ, సోదరి షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎలక్షన్ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పరకాలలో జరిగిన ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో వైఎస్ విజయమ్మతో పాటుగా షర్మిల పైనా కేసులు నమోదయ్యాయి. కొండా మురళీతోపాటు కొండా సురేఖపైనా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొండా సురేఖ దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
Samayam Telugu ys vijayamma sharmila


జనవరి 10న వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే సమన్లు అందకపోవడంతో వారు కోర్టు ముందు హాజరు కాలేదు. దీంతో మరొకసారి సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నాంపల్లి కోర్టు వై.ఎస్. విజయమ్మ షర్మిలకు సమన్లు జారీ చేసింది. విజయవాడలో ఉన్న వైఎస్ విజయమ్మ, షర్మిలకు నాంపల్లి కోర్టు అధికారులు స్వయంగా సమన్లు అందజేయనున్నారు. ఫిబ్రవరి 14న వీరిద్దరూ తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.