యాప్నగరం

ఎన్టీఆర్‌కు మరణం లేదు.. నిత్యం వెలిగే మహోన్నత దీపం: బాలకృష్ణ ఎమోషనల్

తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. మహానేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి ఓ రాజకీయ విప్లవం తీసుకొచ్చారని పేర్కొన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 29 Mar 2023, 9:00 pm
నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక రాజకీయ విప్లవం తీసుకొచ్చారని.. అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చారని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోతవ్సవ సభలో బాలకృష్ణ పాల్గొన్నారు.
Samayam Telugu సభలో మాట్లాడుతున్న బాలకృష్ణ


ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. పేద ప్రజల ఆకలి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. ప్రతి తెలుగు బిడ్డ సగర్వంగా తలఎత్తుకునేలా చేశారని.. ప్రజల భవితకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. నవజాతికి ఎన్టీఆర్‌ మార్గదర్శకమని.. యువతకు ఆదర్శమన్నారు. ఎన్టీఆర్‌కు మరణం లేదని.. నిత్యం వెలిగే మహోన్నత దీపమని అన్నారు.

దివంగత ఎన్టీఆర్ ఇళ్లు లేని వారికి పక్కా ఇళ్ల పథకం తీసుకొచ్చారని బాలకృష్ణ గుర్తు చేశారు. తెలంగాణలో పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి సామాజిక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు.

సహకార వ్యవస్థలో సింగల్ విండో విధానం తెచ్చిన మహానేత ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు. గురుకుల విద్యా బోధన, సంక్షేమ హాస్టళ్లను కూడా ఆయనే తీసుకొచ్చారని ఆనాటి విషయాలను ప్రజలతో పంచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.