యాప్నగరం

నా పొరపాటును మన్నించండి.. ఆ వ్యాఖ్యలపై బాలయ్య బహిరంగ లేఖ

నటసింహాం నందమూరి బాలకృష్ణ బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేశానని మన్నించాలంటూ బాలయ్య బహిరంగ లేఖ విడుదల చేశారు. దేవాంగుల నాయకుడు రావణ బ్రహ్మ అని తాను అన్న మాట వల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చాలా బాధ పడ్డానంటూ లేఖలో తెలిపారు బాలయ్య. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని క్లారీటీ ఇచ్చారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 15 Jan 2023, 11:59 am

ప్రధానాంశాలు:

  • నందమూరి బాలకృష్ణ బహిరంగ లేఖ
  • దేవాంగులపై చేసిన వాఖ్యలపై బాలయ్య క్లారిటీ
  • తన పొరపాటును మన్నించాలంటూ వినతి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu balakrishna
బాలకృష్ణ
నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో దుమ్మురేపుతున్నాడు. సంక్రాంతి వేళ రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. హౌస్‌ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. కాగా.. ఇదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీయగా.. వాటిపై స్పందించారు. నిన్ననే.. సినిమాలోని పొలిటికల్ డైలాగులపై స్పందించిన బాలయ్య.. దేవబ్రాహ్మణులపై చేసిన కామెంట్లపై స్పందించారు. పొరపాటున ఆ మాటలు అన్నానని.. తనను మన్నించాలంటూ బాలయ్య బహిరంగ లేఖ విడుదల చేశారు. దేవాంగుల నాయకుడు రావణ బ్రహ్మ అని తాను అన్న మాట వల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చాలా బాధ పడ్డానంటూ లేఖలో తెలిపారు బాలయ్య. దేవ బ్రాహ్మణుల నాయకుడు రావణుడని తనకందిన సమాచారం తప్పని చెప్పిన పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

తనకు ఎవరీని బాధపెట్టాలన్న ఆలోచన లేదని.. ఉండదని కూడా తెలుగు ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని క్లారీటీ ఇచ్చారు. పైగా దేవాంగులలో తనకు చాలా మంది అభిమానులున్నారన్న బాలయ్య.. నా వాళ్లను నేను బాధపెట్టుకుంటానా అంటూ ప్రశ్నించారు. అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని.. పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్టు బహిరంగ లేఖలో బాలయ్య వివరించారు.
‘వీరసింహారెడ్డి’ సినిమాలో సంభాషణలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో కాదో ప్రజలకు తెలుసని బాలయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఒక ఓటరుగా తన అభిప్రాయాలు చెబుతున్నానని తెలిపారు.

ఆంధ్రా బరిలో సత్తా చాటుతోన్న తెలంగాణ పుంజులు..
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.