యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్సీతో నందమూరి హీరో భేటీ

వైసీపీ నేత గిరిధర రెడ్డితో కలిసి ఆ తర్వాత ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో కాసేపు మాట్లాడారు. అనంతరం హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు తారక్.

Samayam Telugu 11 Oct 2020, 9:49 am
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని కలిశారు నందమూరి హీరో. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డితో ప్రముఖ సినిమా హీరో నందమూరి వారసుడు తారకరత్న భేటీ అయ్యారు. శనివారం ప్రభాకర్‌రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా ఆయనను కలిసినట్లు సమాచారం. జమ్మలమడుగు మండలం గండికోటలో ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంతో అక్కడకు సినిమా షూటింగ్ నిమిత్తం హీరో నందమూరి తారకరత్న తిరుగు ప్రయాణంలో జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు గిరిధర్‌రెడ్డితో కలసి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వచ్చారు.
Samayam Telugu గంగులను కలిసిన తారకరత్న
taraka ratna meets ycp mlc


ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డితో తారకరత్న కాసేపు మాట్లాడారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఏడాది తారకరత్న నటించిన సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. అయితే మర్యాద పూర్వకంగా వీరిద్దరి భేటీపై రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. తారక్ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీని కలవడంపై పలువురు చర్చించుకుంటున్నారు. భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం ఏదైనా దాగి ఉందా అని మాట్లాడుకుంటున్నారు.

Read More: విజయవాడలో అర్థరాత్రి కాల్పులు.. యువకుడి మృతి

మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనం కోసం వచ్చిన దంపతులకు మఠం మేనేజర్‌ వైకుంఠం, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్‌ స్వాగతం పలికారు. ఆ తరువాత అహోబిల క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.