యాప్నగరం

నందమూరి తారకరత్నకు ఎక్మోపై వైద్యం.. సాయంత్రం బెంగళూరుకు చంద్రబాబు

Nandamuri Taraka Ratna Health Update అధికారికంగా రావాల్సి ఉంది. తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయలో వైద్యం కొనసాగుతోంది. ఎక్మోపై వైద్యం అందిస్తున్నారు.. ఇవాళ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. శుక్రవారం నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలింపు. మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరుకు తరలించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 28 Jan 2023, 11:27 am

ప్రధానాంశాలు:

  • బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్న
  • స్పెషల్ డాక్టర్ల టీమ్ పర్యవేక్షణలో తారకరత్న ట్రీట్మెంట్
  • ఇవాళ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nandamuri Taraka Ratna Ecmo Treatment
నందమూరి తారకరత్నకు బెంగళూరు బొమ్మసంద్రలో ఉన్న నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కుప్పం నుంచి అర్ధరాత్రి తర్వాత 2.30 గంటలకు అంబులెన్స్‌లో చేరుకున్నారు. అంబులెన్స్‌తో పాటూ నందమూరి బాలకృష్ణ, తారక రత్న భార్య అలేఖ్య రెడ్డిలు కూడా ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో డాక్టర్ల టీమ్ పర్యవేక్షణలో తారకరత్న చికిత్స పొందుతున్నారు.
తారకరత్నకు వైద్యులు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్(ఐసీసీయూ)‌లో వైద్యం అందిస్తున్నారు. ఆయనకు ఎక్మోపై వైద్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తారకరత్న రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఎక్మో అమర్చడం వల్ల ఆర్టిఫిషియల్‌గా శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్ అందుతుంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రివర్గాలు ఇవాళ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు సాయంత్రం 4.30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరు రానున్నట్లు తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి, చికిత్సను నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.

శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. శుక్రవారం వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి తారకరత్న, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలతో కలిసి ముందుకు సాగారు. అనంతరం బాబునగర్‌ దగ్గర మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మళ్లీ తిరిగి పాదయాత్ర ప్రారంభించారు.. కొంతదూరం నడిచిన తర్వాత.. నందమూరి తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు.

వెంటనే టీడీపీ కార్యకర్తలు అప్రమత్తం అయ్యారు.. కిందపడిపోయిన తారకరత్నను దగ్గరలో ఉన్న కేసీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.. అక్కడ ప్రాథమికంగా వైద్యం అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో పీఈఎస్‌ మెడికల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తారకరత్నను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ట్రీట్మెంట్ అందించారు.. ముందు కుప్పంలోని ఆస్పత్రిలోనే ఉంచి వైద్యం కొనసాగించాలని భావించారు. ఇటు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కుప్పం ఆస్పత్రికి చేరుకున్నారు.. కొద్దిసేపటికే నారా లోకేష్ తొలి రోజు పాదయాత్ర ముగించుకుని తారకరత్న చికిత్సపొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ముందు అక్కడే ఉంచి వైద్యం కొనసాగించాలని భావించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం.. కుప్పం పీఈఎస్ వైద్యుల సలహా మేరకు శుక్రవారం రాత్రి తారకరత్నను బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అధునాతన వైద్య సౌకర్యాలున్న అంబులెన్సులో తీసుకెళ్లారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.