యాప్నగరం

'ఆత్మహత్యల్ని ఎగతాళి చేస్తారా.. మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా'.. లోకేష్ ఫైర్

'ఇసుక సమస్య పరిష్కరించి కార్మికులను ఆదుకోవాల్సిన వారు పుండు మీద కారం జల్లే విధంగా మాట్లాడటం సబబు కాదు. మాటలు తూలిన మంత్రి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి'

Samayam Telugu 31 Oct 2019, 10:33 pm
Samayam Telugu botsa
ఏపీలో ఇసుక తుఫాన్ మొదలయ్యింది. టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీక్ష తర్వాత రాజకీయం మరింత వేడెక్కింది. లోకేష్ టార్గెట్‌గా మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు విరుచుకుపడితే.. తిరిగి రివర్స్‌లో లోకేష్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై లోకేష్ మండిపడ్డారు. మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు టీడీపీ రూ.లక్ష ఆర్థిక సాయం

‘ఆకలి బాధతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... వైకాపా మంత్రులు ఒళ్లు కొవ్వెక్కి ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా? బాధ్యతలేదా? దీనికంతటికీ మీ తుగ్లక్ తీసుకున్న నిర్ణయాలు, మీ నేతల అక్రమ ఇసుకదందా కారణం కాదా?’అంటూ లోకేష్ ప్రశ్నించారు.
‘ఇసుక సమస్య పరిష్కరించి కార్మికులను ఆదుకోవాల్సిన వారు పుండు మీద కారం జల్లే విధంగా మాట్లాడటం సబబు కాదు. మాటలు తూలిన మంత్రి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆత్మహ్యత్యలు చేసుకున్న కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి’అని లోకేష్ డిమాండ్ చేశారు.
Also Read: కోర్టులో లొంగిపోయిన కోడెల శివప్రసాదరావు కుమార్తె

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.