యాప్నగరం

‘ఇది కల్పితం.. దిస్ ఈస్ వాస్తవం.. ఎప్పుడు క్షమాపణ చెప్తారు జగన్‌’

పోలవరం విషయమై సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు క్షమాపణ చెబుతారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. పోలవరంపై గతంలో వైఎస్ జగన్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు.

Samayam Telugu 13 Feb 2020, 4:50 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి గతంలో సీఎం జగన్, మంత్రి అనిల్ చెప్పిన మాటలను, 58 శాతం పనులు పూర్తయ్యాయని పత్రికలో వచ్చిన కథనాన్ని జోడించి సెటైర్లు పేల్చారు. ఈ మేరకు గురువారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
Samayam Telugu jagan 6


ప్రజా కోర్టులో సీఎం జగన్ ఎప్పుడు క్షమాపణలు చెబుతున్నారని నారా లోకేశ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో పోలవరానికి పునాది పడలేదని వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు హయాంలో పోలవరం పనులు 58 శాతం పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.

‘దిస్ ఈజ్ వాస్తవం’ అనే సీఎం జగన్ అప్పుడు పోలవరంపై అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలిగా అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.