యాప్నగరం

YSRCP కీలక నేత ఇంటికి వెళ్లిన నారా లోకేష్.. ఆసక్తికర సన్నివేశం

Nara Lokesh మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దేవరపల్లి అగ్రహారంలో బాదుడే, బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.. కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి.. ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్నారని విమర్శించారు. ఈ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నారా లోకేష్ వైఎస్సార్‌సీపీ నేత వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్ ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ విషయాన్ని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 28 Sep 2022, 6:04 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nara Lokesh
టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం లో బాదుడే బాదుడు కార్యక్రమం లో పాల్గొన్నాను. స్దానిక నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నాను. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను. లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాను.
ఈ క్రమంలో నారా లోకేష్ వైఎస్సార్‌సీపీ నేత ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మంగళగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్ (Venigalla Sri Krishna Prasad) నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోలను నారా లోకేష్ ట్వీట్ చేశారు. నారా లోకేష్ వెంట టీటీపీ నేతలు కూడా ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్నారని లోకేష్ విమర్శించారు. సంక్షేమం గోరంత.. బాదుడే బాదుడు పేరుతో జగన్ దోపిడీ కొండంత అన్నారు. అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారని.. పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.