యాప్నగరం

Guntur Rape: 'జగన్ గారు.. వాడికి 21 రోజుల్లో శిక్షపడేలా చేయండి'

గుంటూరులో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన పొరుగింటి కుర్రాడు. ఘటనపై పార్టీలు, మహిళా సంఘాల ఆందోళనలు.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఘటనపై ట్వీట్ చేసిన మాజీ మంత్రి నారా లోకేష్.

Samayam Telugu 14 Dec 2019, 1:43 pm
ఏపీ ప్రభుత్వం దిశ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం అసెంబ్లీ కూడా బిల్లుకు ఆమోదం తెలిపింది.. అలా బిల్లుకు ఆమోద ముద్ర పడిందో లేదో గుంటూరులో దారుణమైన ఘటన బయటపడింది. ఓ చిన్నారిపై పక్కింట్లో ఉండే కుర్రాడు అత్యాచారానికి ఒడిగట్టాడు. రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలతో పాటూ మహిళా, ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. బాధితురాలిని పరామర్శించడానికి వచ్చిన ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను అడ్డుకున్నారు.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu jagan.


Read Also: Mla Rojaపై ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఈ ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. దిశ బిల్లుని శాసనసభలో ఆమోదించిన రోజే గుంటూరులో దారుణం వెలుగుచూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నెం పున్నెం తెలియని ఐదేళ్ల బాలిక పై మృగాడు లక్ష్మణ్ రెడ్డి అత్యాచారానికి పాల్పడిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని.. ఒక పక్క చట్టాలు పదునెక్కుతున్నా రోజూ జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి అన్నారు.
మహిళలు బయటకు వెళ్ళాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొందని లోకేష్ వ్యాఖ్యానించారు. కొత్త చట్టం ప్రకారం ముఖ్యమంత్రి జగన్ గారు నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేసి.. బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యడంతో పాటు, మహిళలకు భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు నారా లోకేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.