యాప్నగరం

వారికి అర్హత లేదా..? జగన్ పాలనపై నారా లోకేష్ సెటైర్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలపై నారా లోకేష్ విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో సీఎం ఆడుకోవడం మంచిది కాదన్నారు.

Samayam Telugu 27 Dec 2020, 9:02 am
మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు చేశారు. జగన్ పాలనలో తనదైన స్టైల్‌లో ట్వీట్లు చేస్తూ ఆరోపణలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీఓని వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చెయ్యాలన్నారు. Read More: YS Jagan: కులాలపై సీఎం వ్యాఖ్యలు దుమారం.. ట్విస్ట్ ఇచ్చిన అమరావతి జేఏసీఇప్పుడు ఏకంగా ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు లోకేష్. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ఆడుకోవడం మంచిది కాదని హితవు పలికారు. మీ పిల్లలకు మాత్రమే ఫారెన్ చదువులా? బడుగు,బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా జగన్ గారు? అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసారని విమర్శించారు. ఎన్నికల ముందు కూతలు అధికారం వచ్చాకా కోతలు అంటూ జగన్ పాలనపై నారా లోకేష్ సెటైర్లు వేశారు.
Samayam Telugu జగన్ లోకేష్
lokesh jagan



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.