యాప్నగరం

Chandrababu House: 'చంద్రబాబుపై కుట్ర జరుగుతోంది.. ఆధారాలివే'.. లోకేష్ ట్వీట్స్

చంద్రబాబు నివాసంలోకి వరద నీరు తెప్పించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోంది. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉండే చంద్రబాబు నివాసం దగ్గరకు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎలా ఉపయోగిస్తారు.

Samayam Telugu 16 Aug 2019, 3:15 pm
వైసీపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని.. తాజా పరిణామాలన్నీ చూస్తే పరిస్థితి అలాగే ఉందన్నారు. అటు బాబు నివాసంలోకి వరద నీరు తెప్పించడానికి.. ఇటు ప్రాణహాని కలిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ట్విట్టర్‌లో జగన్ సర్కారుకు ప్రశ్నలు సంధించారు.
Samayam Telugu babu


‘చంద్రబాబుగారి ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూరాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు?’అంటూ ప్రశ్నించారు.
‘వైఎస్ జగన్ గారూ.. అమెరికాకు వెళ్తూ చంద్రబాబుగారికి ప్రాణహాని కలిగించమని మీ వాళ్ళకు ప్లాన్ ఇచ్చి వెళ్ళారా? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగిరాయి? డ్రోన్ తో ఉన్న బాక్సులో ఏముంది? వాళ్ళు మీ పేరెందుకు చెప్పారు?’అని ప్రశ్నించారు. #CBNSafetyAtRisk అంటూ హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేశారు.
Read Also: బాబు ఇంటిపై డ్రోన్ కెమెరా.. జగన్ సర్కార్ క్లారిటీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.