యాప్నగరం

'కూల్చేయడమే పాలనా?.. అధికారం శాశ్వతం కాదు జగన్ గారూ..'

'అక్రమ కట్టడాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లను కూల్చేయడం దారుణం. కక్షసాధింపు కోసం వైసీపీ దౌర్జన్యాలు చేస్తోంది. జర్నలిస్టును చంపుతానని బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యేను వదిలేసి.. ప్రజల కోసం ప్రశ్నించిన జనసేన ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా'

Samayam Telugu 14 Aug 2019, 11:26 am

ప్రధానాంశాలు:

  • జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ ఫైర్
  • టీడీపీ నేతలు అన్యాయం కూల్చారన్నలోకేష్
  • జనసేన ఎమ్మెల్యే అరెస్ట్‌పైనా స్పందించిన నేత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu jagan
వైసీపీ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షసాధింపు చర్యలకు దిగుతోందని.. టీడీపీ నేతలు, కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇదేం పాలన అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు లోకేష్. జనసేన ఎమ్మెల్యే విషయంలోనూ జగన్ సర్కార్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘కూల్చడాలే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వ పాలన సాగుతోంది. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో తెదేపా నాయకులకు చెందిన 3 ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో కూల్చేశారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం వైకాపా దౌర్జన్యాలకు అండగా నిలుస్తుండటం దురదృష్టకరం. కక్షసాధింపులు, కూల్చడాలు.. ఇదేనా మీకు చేతనైన పరిపాలన జగన్ గారూ? అధికారం మీకు శాశ్వతం కాదు గుర్తుంచుకోండి’అన్నారు.
‘ఒక పత్రికా విలేఖరిని చంపుతానన్న ఎమ్మెల్యేని అరెస్టు చేయని ప్రభుత్వం... మలికిపురం ఘటనలో ప్రజల తరపున ప్రశ్నించినంత మాత్రాన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారిని అరెస్టు చేసింది. అంటే ఏమిటి? అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయొచ్చు. ప్రతిపక్షం మాత్రం న్యాయమడిగినా తప్పా? ఏమిటీ నియంతృత్వం?’అంటూ ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.