యాప్నగరం

‘దొంగ దారిలో వెళ్లేందుకు జగన్ కొత్త మార్గం’ లోకేశ్ సంచలన కామెంట్లు

AP Capital: రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి పేర్లను లోకేశ్ ప్రస్తావించారు. శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలిపై అక్రమంగా కేసులు పెట్టి వారిని వేధింపులకు గురి చేశారని లోకేశ్ ధ్వజమెత్తారు.

Samayam Telugu 19 Jan 2020, 2:31 pm
ఏపీ రాజధాని వ్యవహారంపై మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విటర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల్ని జగన్ చంపేస్తున్నారని, ఈ రైతుల మరణాలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని ధ్వజమెత్తారు. అంతేకాక, ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో దున్నపోతు ప్రభుత్వంగా అభివర్ణించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి పేర్లను లోకేశ్ ప్రస్తావించారు. శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలిపై అక్రమంగా కేసులు పెట్టి వారిని వేధింపులకు గురి చేశారని లోకేశ్ ధ్వజమెత్తారు.
Samayam Telugu Nara Lokesh on Ap capital farmers deaths


Also Read: మాజీ ఎంపీ రాయపాటికి ‘సీబీఐ అధికారుల’ బెదిరింపులు.. నిఘా టీంతో గుట్టు రట్టు

ప్రభుత్వ నిర్వాకానికి మనస్తాపం చెందిన రైతు అబ్బూరి అప్పారావు ఆందోళనతో చనిపోయారని, మరో మహిళా రైతు సామ్రాజ్యమ్మ కూడా గుండె పోటుతో మరణించారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఆదివారం మధ్యాహ్నం లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. మరణించిన రైతుల అబ్బూరి అప్పారావు ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా కలచి వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకి ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని అన్నారు. ప్రభుత్వం చేసేది దొంగ పనులు కాబట్టే రాజధాని ప్రాంత గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను మోహరించారని విమర్శించారు. ప్రజల మధ్యలోంచి కాకుండా మరో దారిలో వెళ్లడానికి జగన్ కొత్త రోడ్డు వేయించుకున్నారని విమర్శించారు.

Also Read: కేసీఆర్‌కు ధైర్యం ఉందా! దమ్ముంటే ఆ పని చేయాలి :ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు

ఆదివారం నారా లోకేశ్ మూడు ట్వీట్లు చేశారు. ‘‘రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతుల్ని వైఎస్ జగన్ గారు చంపేస్తున్నారు. ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలి తీసుకుంటుంది. రాజధాని తరలింపు ఆందోళనతో రైతుల మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే. శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడంతో రైతు అబ్బూరి అప్పారావు ఆందోళనతో మృతి చెందారు. మహిళా రైతు సామ్రాజ్యమ్మ గుండె పోటుతో మరణించారు. ఈ ఘటనలు నన్ను తీవ్రంగా కలచివేసాయి. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకి ఈ పరిస్థితి రావడం దారుణం. చేసేవి దొంగ పనులు కాబట్టే గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారు. ప్రజల మధ్యలోంచి కాకుండా జగన్ గారు దొంగ దారిలో వెళ్లడానికి కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు.’’ అని లోకేశ్ తెలుగులో ట్వీట్ చేశారు.

Also Read: హైదరాబాద్: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు.. పట్టుబడ్డ మహిళలపై కేసులు
Also Read: హైదరాబాద్ పోలీసుల హ్యాకథాన్.. సత్తా ఉంటే రూ.లక్ష ప్రైజ్ మనీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.