యాప్నగరం

'ఆ వైసీపీ ఎమ్మెల్యేకు పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలా'

Kotamreddy Sridhar Reddy| 'మహిళా ఎంపిడివో అర్థరాత్రి వేళ ఫిర్యాదు చేయడానికి వెళ్తే 8 గంటలు వెనుకాడిన పోలీసులు, అందుకు కారణమైన వైసిపి ఎమ్మెల్యేకు మాత్రం స్టేషన్ లో రాజమర్యాదలు చేసి, నామమాత్ర కేసులు పెట్టి 2 గంటల్లోనే బైయిలు ఇచ్చారు'

Samayam Telugu 7 Oct 2019, 5:30 pm
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి-వెంకటాచలం ఎంపీడీవో సరళ వివాదం సంగతి తెలిసిందే. కోటంరెడ్డి తనపై దౌర్జ్యనం చేసి బెదిరించారని.. ఆమె పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి దీక్ష చేశారు. తన అనుచరుడుకి పంచాయితీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి అడిగారని.. ఆ విషయం పరిశీలిస్తానని తాను చెప్పినా ఫోన్‌లో బెదిరించారన్నారు. కల్లూరిపల్లిలోని తన ఇంటికి శుమద్యం సేవించి అనుచరులతో కలిసి కోటంరెడ్డి వచ్చి దౌర్జన్యానికి దిగారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఘటనను టీడీపీ అస్త్రంగా మార్చుకొని జగన్ సర్కార్‌ను టార్గెట్ చేసింది.
Samayam Telugu kotamreddy


Read Also: చింతమనేని‌ మళ్లీ అరెస్ట్.. ఇది ఐదో కేసులో!

ఈ వివాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మళ్లీ స్పందించారు. ‘తనకు ప్రాణహాని ఉందని ఒక మహిళా ఎంపిడివో అర్థరాత్రి వేళ ఫిర్యాదు చేయడానికి వెళ్తే 8 గంటలు వెనుకాడిన పోలీసులు, అందుకు కారణమైన వైసిపి ఎమ్మెల్యేకు మాత్రం స్టేషన్ లో రాజమర్యాదలు చేసి, నామమాత్ర కేసులు పెట్టి 2 గంటల్లోనే బైయిలు పై విడుదల చేసారు’అని ఆరోపించారు.
‘స్త్రీ శక్తికి సంకేతంగా జరుపుకునే దసరా ఉత్సవాల వేళ, విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్న ఒక మహిళా అధికారిణికి జగన్ గారి ప్రభుత్వం చేసిన అన్యాయం ఇది’అన్నారు నారా లోకేష్. ఇంతకముందు ఎంపీడీవో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా అంశాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. తాజాగా కోటంరెడ్డి బెయల్ వ్యవహారంపైనా ఆరోపణలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.