నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉపవాస దీక్షకు కూర్చుకున్నారు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఉపవాస దీక్ష కొనసాగనుంది. 11వ పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. వారికి సంఘీభావంగా ఉపవాస దీక్ష చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలందరూ కూడా తమ మద్దతు తెలియజేయాలని ఎంపీ కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న రివర్స్ కానుకపై ఉద్యోగుల ఆగ్రహజ్వాలలను చవిచూసిన ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు ఆందోళనలకు సిద్ధమవుతున్నారని అన్నారు. జగనన్న ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీని కానుకగా ఇచ్చారని సెటైర్లు వేశారు. ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తిగా ఉన్నాయని.. ఇలాంటి కోతలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.
ఢిల్లీలో ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష.. సాయంత్రం 6 గంటల వరకు..
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉపవాస దీక్షకు కూర్చుకున్నారు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు.
Samayam Telugu 19 Jan 2022, 10:09 am
ప్రధానాంశాలు:
- ఢిల్లీలో ఉపవాస దీక్ష చేపట్టిన ఎంపీ రఘురామ కృష్ణరాజు
- ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా దీక్ష
- సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఉపవాస దీక్ష