‘నాపై నిఘా.. పవన్ కల్యాణ్పై పగ.. ఇదీ జగనన్న తీరు’అంటూ టార్గెట్ చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. తన మీద నిఘా పెట్టారని.. రామకృష్ణారెడ్డి అనే ఏఎస్ఐని తనపై ప్రయోగించారని ఆరోపించారు. ఒక ఎంపీకి ప్రశాంతంగా జీవించే హక్కు లేదా.. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛగా జీవించే హక్కును హరించే అధికారం సీఎం జగన్కు, డీజీపీ కసిరెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘మీ మనసులో ఏముంది? ఏం చేద్దామని మీ ఉద్దేశం?’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన తనపై జగన్ నిఘా పెట్టించారని వ్యాఖ్యానించారు. మరోసారి తనను అరెస్టు చేసేందుకు హైదరాబాద్లోని ఇంటి వద్ద మఫ్టీలో పోలీసులను పెట్టారని.. ప్రభుత్వ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన తగిన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు.
పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ప్రశ్నించిన ప్రతి వారిని అధికార బలంతో దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ కావడానికి పవన్ కళ్యాణ్ నటన.. మంత్రి పేర్ని నాని అతి నటన కారణమని అన్నారు.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేతాజీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత హైదరాబాద్కు రావడంతో తన మీద మళ్లీ వేట ప్రారంభమైందని రఘురామ శనివారం కూడా ఆరోపించారు. తన మీద నిఘా పెట్టారని.. తన ఇంటి ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగారని ఆరోపించారు. ఆ వ్యక్తిని గట్టిగా ప్రశ్నిస్తే.. మరికొద్ది గంటల్లో తనను అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తనతో చెప్పారన్నారు.
రెండు రోజుల నుంచి నిఘా పెట్టి ఉంచారని తనకు తెలిసిందన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా.. తన మీద నిఘా పెడుతున్న ఈ తుచ్చ రాజకీయ నాయకులను ఏం చేయాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలకు తనపై నిఘా ఉంచిన వ్యక్తి ఫొటోలను పంపించానని తెలిపారు. ఆంధ్ర పోలీసులు తెలంగాణలో తిరిగేందుకు ఇక్కడి వారు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారని నిలదీశారు.
తెలంగాణ పోలీసుల అనుమతి లేకుండానే ఏపీ పోలీసులు ఇక్కడ తిరుగుతున్నారా..? అని రఘురామ ప్రశ్నించారు. తనకు అనుమానులున్నాయని చెప్పారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చానని తెలిపారు. ఏమవుతుందో చూద్దామన్నారు. కోర్టులో న్యాయం జరిగినా.. జరగపోయినా.. ప్రివిలేజ్ కమిటీ ఏం చేసినా.. చేయకపోయినా.. ప్రజా న్యాయ క్షేత్రంలో ఉంచుతున్నానని అన్నారు. ఈ ప్రభుత్వాల ఆరాచకాలు ఇంకేంత కాలం మనం చూడాలో అన్నారు. మళ్లీ ఆదివారం కూడా రచ్చబండలో అవే ఆరోణలు చేశారు.
పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ప్రశ్నించిన ప్రతి వారిని అధికార బలంతో దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ కావడానికి పవన్ కళ్యాణ్ నటన.. మంత్రి పేర్ని నాని అతి నటన కారణమని అన్నారు.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేతాజీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత హైదరాబాద్కు రావడంతో తన మీద మళ్లీ వేట ప్రారంభమైందని రఘురామ శనివారం కూడా ఆరోపించారు. తన మీద నిఘా పెట్టారని.. తన ఇంటి ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగారని ఆరోపించారు. ఆ వ్యక్తిని గట్టిగా ప్రశ్నిస్తే.. మరికొద్ది గంటల్లో తనను అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తనతో చెప్పారన్నారు.
రెండు రోజుల నుంచి నిఘా పెట్టి ఉంచారని తనకు తెలిసిందన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా.. తన మీద నిఘా పెడుతున్న ఈ తుచ్చ రాజకీయ నాయకులను ఏం చేయాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలకు తనపై నిఘా ఉంచిన వ్యక్తి ఫొటోలను పంపించానని తెలిపారు. ఆంధ్ర పోలీసులు తెలంగాణలో తిరిగేందుకు ఇక్కడి వారు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారని నిలదీశారు.
తెలంగాణ పోలీసుల అనుమతి లేకుండానే ఏపీ పోలీసులు ఇక్కడ తిరుగుతున్నారా..? అని రఘురామ ప్రశ్నించారు. తనకు అనుమానులున్నాయని చెప్పారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చానని తెలిపారు. ఏమవుతుందో చూద్దామన్నారు. కోర్టులో న్యాయం జరిగినా.. జరగపోయినా.. ప్రివిలేజ్ కమిటీ ఏం చేసినా.. చేయకపోయినా.. ప్రజా న్యాయ క్షేత్రంలో ఉంచుతున్నానని అన్నారు. ఈ ప్రభుత్వాల ఆరాచకాలు ఇంకేంత కాలం మనం చూడాలో అన్నారు. మళ్లీ ఆదివారం కూడా రచ్చబండలో అవే ఆరోణలు చేశారు.