యాప్నగరం

నా కేసులో కూడా అదే జరిగింది.. నారాయణ కోర్టును ఆశ్రయించడం మంచిది: రఘురామ

Ex Minister Narayana Arrestపై స్పందించిన ఎంపీ రఘురామ. తన కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారాయణ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడం మంచిదని సలహా ఇచ్చారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 10 May 2022, 3:53 pm

ప్రధానాంశాలు:

  • మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై రఘురామ స్పందన
  • జగన్, మంత్రి బొత్సను కూడా అరెస్ట్ చేయాలన్న ఎంపీ
  • దెబ్బతిన్న వ్యక్తిగా ఇదంతా చెబుతున్నానన్న రఘురామ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఎంపీ రఘురామ
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. నారాయణను అరెస్ట్ చేయడం సరికాదని.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారు నారాయణ అరెస్ట్‌ను ఖండించాలని పిలుపునిచ్చారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీకేజికి కారణమని సీఎం జగన్ అన్నారని.. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ అదంతా అబద్ధం అని చెప్పారని.. ఇందులో ఏది నిజం, ఏది నమ్మాలని ప్రశ్నించారు. ఈ లీకేజీ వ్యవహారంలో 36 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం ఇటీవల చెప్పిందని గుర్తు చేశారు. నారాయణ అరెస్టు న్యాయం అనుకుంటే.. సీఎం జగన్‌, విద్యాశాఖ మంత్రి బొత్సనూ అరెస్టు చేయాలి కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నారాయణ, శ్రీచైతన్య స్కూల్స్ నుంచే పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని ముఖ్యమంత్రి జగన్ తిరుపతి సభలో అన్నారని.. కానీ బొత్స మాత్రం అబద్ధమన్నారని రఘురామ చెప్పుకొచ్చారు. నారాయణను అరెస్టు చేయడం తప్పన్నారు. అయితే విచారణ చేసే రూముల్లో కెమెరాలు తీసేస్తారని.. ఒకవేళ వారి వెంట వ్యక్తిగత సిబ్బంది ఉంటే పంపించేస్తారని వ్యాఖ్యానించారు. కేవలం కొట్టడం కోసమే తీసుకెళ్తారని.. పచ్చి అబద్ధాలు ఆడతారంటూ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తన కేసు విచారణలో అసలు దొంగలు బయటికి వస్తారన్నారు. దెబ్బతిన్న వ్యక్తిగా ఇదంతా చెబుతున్నట్లు ఎంపీ అంటున్నారు.

సదరు వ్యక్తులపై రెండు, మూడు దెబ్బలు పడితే ఏదైనా జరగొచ్చని.. నారాయణను అభిమానించే వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ ఎలా ఉందో తెలియదని.. వెంటనే కోర్టును ఆశ్రయించడం మంచిదని సలహా ఇచ్చారు. ఈ ప్రభుత్వ అధినేతలు ఎంతకైనా తెగించే వారని.. రాష్ట్రంలో అన్యాయాలపై ప్రశ్నించడానికి ఇప్పుడిప్పుడే నేతలు, ప్రజలు బయటికొస్తున్నారన్నారు. ఓ సీనియర్‌ నేతను అరెస్ట్‌ చేస్తే వీళ్లంతా భయపడతారని అనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.