యాప్నగరం

కేంద్ర బలగాలతో RRR.. సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీ ఫోటో వైరల్

ఆయనకు 10 మంది వరకు సెక్యూరిటీగా ఉన్నారు. తాజాగా కేంద్ర బలగాలతో కలిసి ఆయన ఓ ఫోటో దిగారు. ఆయన చుట్టూ సెక్యూరిటీ నిలబడి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samayam Telugu 22 Aug 2020, 1:18 pm
వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర బలగాల పహారాలోకి వెళ్లిపోయారు. కేంద్రం ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించడంతో సీఎస్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఆయనకు 10 మంది వరకు సెక్యూరిటీగా ఉన్నారు. తాజాగా కేంద్ర బలగాలతో కలిసి ఆయన ఓ ఫోటో దిగారు. ఆయన చుట్టూ సెక్యూరిటీ నిలబడి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజుగారు అనుకున్నది సాధించారు.. మొత్తానికి కేంద్ర బలగాల పహారాలో ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మాత్రం నిప్పులు చెరుగుతున్నారు.
Samayam Telugu కేంద్ర బలగాలతో RRR


ఓ ఏపీ మంత్రి, వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కొందరు రఘురామపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎంపీ దిష్టి బొమ్మల్ని దగ్థం చేశారు. దీంతో ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లలేకపోతున్నానని.. తనకు భద్రత కల్పించాలని కోరారు. కేంద్రమంత్రుల్ని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం వై కేటగిరి భద్రతను కల్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.