యాప్నగరం

బాపట్ల ఎంపీ సురేష్‌పై రఘురామకృష్ణ రాజు ప్రివిలేజ్ నోటీస్

యన మీడియాతో మాట్లాడిన వీడియో టేపును కూడా స్పీకర్‌కు అందజేశారు. తనపై అసభ్య పదజాలంతో, కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేశారని స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు.

Samayam Telugu 17 Sep 2020, 3:54 pm
బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై రఘురామకృష్ణ రాజు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సురేష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అసభ్య పదజాలంతో దూషించారని నోటీస్ ఇచ్చానన్నారు. ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో టేపును కూడా స్పీకర్‌కు అందజేశారు. తనపై అసభ్య పదజాలంతో, కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేశారని స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు.
Samayam Telugu రఘురామకృష్ణ రాజు


వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని.. మిథున్ రెడ్డికి నాలుగు ఓట్లు రావని రఘురామ అన్నారని.. ఢిల్లీలో గలీజు పనులు, మోసగాడు, చీటర్ లాంటి పదవులకు పోటీ పడితే ఆయనకే ఎంపీల ఓట్లన్నీ పడతాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో రఘురామ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.. దీనిపై ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.