యాప్నగరం

YS Jagan‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ.. కేసీఆర్ లాజిక్‌తో ట్విస్ట్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరో లేఖ రాసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాజిక్‌తో లేఖను రాసిన ఎంపీ.

Samayam Telugu 28 Jul 2020, 12:56 pm
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీవీ తెలుగు ప్రజలకు ఒక ఠీవి అన్నారు రఘురామ. చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నేతల్లో ఒకరిగా పీవీ నరసింహారావు నిలిచిపోతారని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి పీవీని గర్వకారణంగా భావిస్తుంది అన్నారు.
Samayam Telugu ఎంపీ రఘురామ


పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు నిర్వహిస్తే బావుంటుందని సలహా ఇచ్చారు. అంతేకాదు పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో మంచిదన్నారు. తెలుగు ప్రజల్లో ప్రేమ, గౌరవం పెరుగుతాయన్నారు. 2004లో పీవీ మరణించాక ఆయనకు అంత్యక్రియలు నిర్వహించిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ప్రాంతాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పీవీ ఘాట్ గా నామకరణం చేశారని గుర్తు చేశారు.

అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. వేడుకల కోసం రూ.10 కోట్లు కేటాయించారని.. వేడుకల కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిందన్నారు. పీవీ శతజయంతి వేడుకలను ఏపీలో నిర్వహించేందుకు కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఆయనకు భారతరత్న ఇచ్చేలా కేంద్రం ప్రతిపాదనలు కూడా పంపాలని కోరారు. పీవీ శతజయంతి వేడుకుల కోసం కేబినెట్ సబ్ కమిటీ, శతజయంతి వేడుకల కమిటీని కానీ ఏర్పాటు చేయాలన్నారు. నిధులు కేటాయించాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.