ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. కష్టాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారని గుర్తు చేసిన ఆయన.. వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్తో లింక్ చేశారన్నారు.. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి 5 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని కోరారు.
సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన రఘురామ ముఖ్యమంత్రి జగన్కు వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలను సీఎంకు వివరిస్తూ లేఖలు పంపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని.. వృద్ధాప్య పింఛన్ వయోపరిమితిపై లేఖలు రాశారు. తాజాగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సీఎంకు లేఖ రాశారు.
సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన రఘురామ ముఖ్యమంత్రి జగన్కు వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలను సీఎంకు వివరిస్తూ లేఖలు పంపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని.. వృద్ధాప్య పింఛన్ వయోపరిమితిపై లేఖలు రాశారు. తాజాగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సీఎంకు లేఖ రాశారు.