యాప్నగరం

అమరావతిలో మహిళా కమిషన్ సభ్యుల విచారణ.. పోలీసులపై ఫిర్యాదు చేసిన మహిళలు

జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఆదివారం అమరావతిలో పర్యటిస్తున్నారు. వారిని కలిసిన ఎంపీ గల్లా జయదేవ్.. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 12 Jan 2020, 2:59 pm
జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఆదివారం అమరావతిలో పర్యటిస్తున్నారు. రాజధానిలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మహిళా కమిషన్ కో ఆర్డినేటర్ కాంచన కట్టర్, కౌన్సిలర్ ప్రవీణ్ సింగ్‌లకు టీడీపీ నేతలు వివరించారు. ఎంపీ గల్లా జయదేవ్.. గుంటూరులోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మహిళా కమిషన్ సభ్యులను కలిశారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వారికి ఫిర్యాదు చేశారు. అమరావతి విషయమై రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారో ఆయన వారికి వెల్లడించారు.
Samayam Telugu ncw


మహిళలపై లాఠీ ఛార్జి, దాడి ఘటనల విషయమై.. తుళ్లూరు తహసీల్దార్‌, డీఎస్పీతో మహిళా కమిషన్ సభ్యులు మాట్లాడారు. అధికారుల నుంచి వివరాలను సేకరించారు. తుళ్లూరు చేరుకునే క్రమంలోనే.. మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలు.. పోలీసులు తమను ఇబ్బంది పెట్టారని మహిళా కమిషన్ సభ్యులకు తెలిపారు. సెల్‌ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలను వారికి చూపించారు. కాగా మహిళా పోలీసులపై కూడా కొందరు దాడులు చేశార‌ని ఏపీ పోలీస్ సంఘం.. మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యా‌దు చేసింది.

మహిళా కమిషన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీంను బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి మాలతీ రాణి, పార్టీ రాష్ట్ర నాయకులు కలిశారు. అమరావతిలో జరుగుతున్న పరిణామాలను వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.