అమరావతి మహిళలపై పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది. మహిళలను పోలీసులు దుర్భాషలాడుతూ దాడి చేసిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలను సుమోటోగా తీసుకుని విచారణ జరపనున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు. మహిళలపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగా రేపు మహిళా కమిషన్ సభ్యుల బృందం ఢిల్లీ నుంచి అమరావతికి రానుంది.
అమరావతి నుంచి విశాఖపట్నంకు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఈ నెల 3వ తేదీన అమరావతి మహిళలు ఆందోళకు దిగారు. మహిళలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు.
Also Read: ఏపీ రాజధానిగా దొనకొండ.? 2014కు ముందు వైసీపీ చాయిస్.! మళ్లీ తెరపైకి..
అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు మహిళలు నిరాకరించడంతో పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా మహిళలు వారిని అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డుగా నిలిచి ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ ఘటనలో మహిళల పట్ల స్థానిక పోలీసులు ప్రవర్తించిన తీరును మహిళా కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది. మీడియా చానళ్లు, ప్రసార మాధ్యమాల ఫుటేజీని పరిశీలించిన అనంతరం సుమోటోగా ఫిర్యాదు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. శుక్రవారం మరోసారి అమరావతి మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. రాజధాని అమరావతిని తరలించకుండా చూడాలని వేడుకునేందుకు విజయవాడ అమ్మవారి ఆలయానికి బయల్దేరిన మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విజయవాడ వెళ్లకుండా రైతులు, మహిళలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. విజయవాడ చేరుకుని బెంజ్ సర్కిల్ వద్ద ఆందోళనకు దిగిన పలువురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: జగనన్నా.. ఆడాళ్లంటే అంత భయమేంటి? సూటిగా ప్రశ్నించిన ఎంపీ
అమరావతి నుంచి విశాఖపట్నంకు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఈ నెల 3వ తేదీన అమరావతి మహిళలు ఆందోళకు దిగారు. మహిళలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు.
Also Read: ఏపీ రాజధానిగా దొనకొండ.? 2014కు ముందు వైసీపీ చాయిస్.! మళ్లీ తెరపైకి..
అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు మహిళలు నిరాకరించడంతో పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా మహిళలు వారిని అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డుగా నిలిచి ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ ఘటనలో మహిళల పట్ల స్థానిక పోలీసులు ప్రవర్తించిన తీరును మహిళా కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది. మీడియా చానళ్లు, ప్రసార మాధ్యమాల ఫుటేజీని పరిశీలించిన అనంతరం సుమోటోగా ఫిర్యాదు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. శుక్రవారం మరోసారి అమరావతి మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. రాజధాని అమరావతిని తరలించకుండా చూడాలని వేడుకునేందుకు విజయవాడ అమ్మవారి ఆలయానికి బయల్దేరిన మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విజయవాడ వెళ్లకుండా రైతులు, మహిళలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. విజయవాడ చేరుకుని బెంజ్ సర్కిల్ వద్ద ఆందోళనకు దిగిన పలువురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: జగనన్నా.. ఆడాళ్లంటే అంత భయమేంటి? సూటిగా ప్రశ్నించిన ఎంపీ