ఆయన నెల్లూరులో పేరున్న గొప్ప డాక్టర్.. తన చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడి ఉంటాడు.. సొంత ఆస్పత్రి.. పెద్ద కుటుంబం.. కావల్సినంత ఆస్తి. కానీ అవన్నీ దేనికీ పనికిరాలేదు.. చివరికి అనాథ శవంగా మిగిలిపోయిన దారుణమైన పరిస్థితి. కరోనా మహమ్మారి సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితాన్ని.. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా.. ప్రాణాంతకమైన వైరస్కు బలైన నెల్లూరు డాక్టర్ కన్నీటి కథపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
Read Also: ఏపీలో ఈ-పాస్లకు పిచ్చ డిమాండ్.. వామ్మో ఒక్కరోజులో అన్నా!
నెల్లూరుకు చెందిన ఆయన ఆర్థోపెడిక్ వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.. సొంతగా ఆస్పత్రి నడుపుతున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలోనే అస్వస్థతగా ఉందని నెల్లూరులోని ఒక ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా అని తేలవడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచారు.. ఆయనకు కరోనా పాజిటివ్ తేలడంతో.. కుటుంబాన్ని నెల్లూరులో క్వారంటైన్కి తరలించారు. ఇంతలోనే చికిత్స పొందుతూ.. దురదృష్టవశాత్తూ ఆ డాక్టర్ కన్నుమూశారు. డాక్టర్ కుటుంబంలో కూడా కొందరికి పాజిటివ్ అని తేలడంతో నెల్లూరులో చికిత్స అందిస్తున్నారు.
ఊరుకాని ఊరులో చనిపోయిన డాక్టర్ అంత్యక్రియలపై గందరగోళం ఏర్పడింది. కరోనా మరణం కాబట్టి.. కేంద్ర నిబంధనల ప్రకారం డెడ్బాడీని కుటుంబానికి అప్పగించకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరపాలి. అంతేకాదు చెన్నై వెళ్లాలన్నా అనుమతులు కావాలి.. దీంతో వారు కూడా వెనకడుగు వేశారు. సొంత కుటుంబం ఐసోలేషన్ వార్డులో ఉంది. పోనీలే అనాథగా అయినా అంత్యక్రియలు జరిగాయా అంటే అదీ లేదు.. ఆస్పత్రి సిబ్బంది ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా దహనానికి నిరాకరించారు. దీనికి కారణం లేకపోలేదు.. ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయినవారికే అంత్యక్రియలు అక్కడ నిర్వహించాలనే రూల్ ఉందట.
డాక్టర్ డెడ్బాడీని ఏం చేయాలో తోచని పరిస్థితిలో అంబత్తూరు శ్మశాన వాటిక వద్దకు ఆ డాక్టరు మృతదేహాన్ని తీసుకెళ్లారు.. అక్కడా ఇబ్బందులు తప్పలేదు. కరోనా కేసు కావడంతో.. అంత్యక్రియలు అక్కడ నిర్వహించొద్దని స్థానికులు ధర్నాకు దిగారు. ఇక్కడ దహనం చేయడానికి వీల్లేదంటూ పట్టుబట్టారు.. ఆస్పత్రి సిబ్బందిని దూషించారు. నిస్సహాయ స్థితిలో ఆస్పత్రి సిబ్బందియ డాక్టర్ మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది.. దీంతో డెడ్బాడీని మార్చురీకి తీసుకెళ్లారు.
అంత్యక్రియలపై గందరగోళం కొనసాగగా.. చివరికి పోలీసులు బంధువుల అనుమతి తీసుకుని ఒక ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. భారీ భద్రత మధ్య మృతదేహాన్ని రెండు రోజుల తర్వాత దహనం చేశారు. డాక్టర్గా గొప్ప జీవితం అనుభవించిన ఆయన చివరికి అనాథ శవంలా సొంత వాళ్లు లేకుండా.. కుటుంబ సభ్యులు కడసారి చూడకుండా కాలగర్భంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన డాక్టర్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.. అందరూ ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయత. పాపం అంతిమంలో సొంతవారికి చివరి చూపు దక్కలేదు.. సరైన వీడ్కోలు లేదు. ఇలాంటి ఘటనలు చూసైనా జనాలు ఇంటిపట్టున ఉండండి.. ప్రధాని చెప్పినట్లు ఇంట్లో పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరణం కంటే కూడా దిక్కులేని చావు బాధాకరం.. ప్లీజ్ స్టే ఎట్ హోం (దయచేసి ఇంట్లోనే ఉండండి).
Read Also: ఏపీలో ఈ-పాస్లకు పిచ్చ డిమాండ్.. వామ్మో ఒక్కరోజులో అన్నా!
నెల్లూరుకు చెందిన ఆయన ఆర్థోపెడిక్ వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.. సొంతగా ఆస్పత్రి నడుపుతున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలోనే అస్వస్థతగా ఉందని నెల్లూరులోని ఒక ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా అని తేలవడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచారు.. ఆయనకు కరోనా పాజిటివ్ తేలడంతో.. కుటుంబాన్ని నెల్లూరులో క్వారంటైన్కి తరలించారు. ఇంతలోనే చికిత్స పొందుతూ.. దురదృష్టవశాత్తూ ఆ డాక్టర్ కన్నుమూశారు. డాక్టర్ కుటుంబంలో కూడా కొందరికి పాజిటివ్ అని తేలడంతో నెల్లూరులో చికిత్స అందిస్తున్నారు.
ఊరుకాని ఊరులో చనిపోయిన డాక్టర్ అంత్యక్రియలపై గందరగోళం ఏర్పడింది. కరోనా మరణం కాబట్టి.. కేంద్ర నిబంధనల ప్రకారం డెడ్బాడీని కుటుంబానికి అప్పగించకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరపాలి. అంతేకాదు చెన్నై వెళ్లాలన్నా అనుమతులు కావాలి.. దీంతో వారు కూడా వెనకడుగు వేశారు. సొంత కుటుంబం ఐసోలేషన్ వార్డులో ఉంది. పోనీలే అనాథగా అయినా అంత్యక్రియలు జరిగాయా అంటే అదీ లేదు.. ఆస్పత్రి సిబ్బంది ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా దహనానికి నిరాకరించారు. దీనికి కారణం లేకపోలేదు.. ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయినవారికే అంత్యక్రియలు అక్కడ నిర్వహించాలనే రూల్ ఉందట.
డాక్టర్ డెడ్బాడీని ఏం చేయాలో తోచని పరిస్థితిలో అంబత్తూరు శ్మశాన వాటిక వద్దకు ఆ డాక్టరు మృతదేహాన్ని తీసుకెళ్లారు.. అక్కడా ఇబ్బందులు తప్పలేదు. కరోనా కేసు కావడంతో.. అంత్యక్రియలు అక్కడ నిర్వహించొద్దని స్థానికులు ధర్నాకు దిగారు. ఇక్కడ దహనం చేయడానికి వీల్లేదంటూ పట్టుబట్టారు.. ఆస్పత్రి సిబ్బందిని దూషించారు. నిస్సహాయ స్థితిలో ఆస్పత్రి సిబ్బందియ డాక్టర్ మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది.. దీంతో డెడ్బాడీని మార్చురీకి తీసుకెళ్లారు.
అంత్యక్రియలపై గందరగోళం కొనసాగగా.. చివరికి పోలీసులు బంధువుల అనుమతి తీసుకుని ఒక ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. భారీ భద్రత మధ్య మృతదేహాన్ని రెండు రోజుల తర్వాత దహనం చేశారు. డాక్టర్గా గొప్ప జీవితం అనుభవించిన ఆయన చివరికి అనాథ శవంలా సొంత వాళ్లు లేకుండా.. కుటుంబ సభ్యులు కడసారి చూడకుండా కాలగర్భంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన డాక్టర్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.. అందరూ ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయత. పాపం అంతిమంలో సొంతవారికి చివరి చూపు దక్కలేదు.. సరైన వీడ్కోలు లేదు. ఇలాంటి ఘటనలు చూసైనా జనాలు ఇంటిపట్టున ఉండండి.. ప్రధాని చెప్పినట్లు ఇంట్లో పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరణం కంటే కూడా దిక్కులేని చావు బాధాకరం.. ప్లీజ్ స్టే ఎట్ హోం (దయచేసి ఇంట్లోనే ఉండండి).