యాప్నగరం

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పాజిటివ్

ఆయనకు కరోనా అని తేలడంతో కుటుంబసభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. కోటం రెడ్డికి కరోనా అని తేలడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 13 Sep 2020, 9:16 am
ఏపీలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. నిత్యం పదివేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన అనేకమంది నేతలు సైతం ఇప్పటివరకు కరోనా బారిన పడ్డారు. అటు అధికారులు, సిబ్బంది, పోలీసులు కూడా కరోనా సోకి ఆస్పత్రుల పాలవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు కరోనా సోకుతోంది. కొందరు ఇప్పటికే రికవరీ కూడా అయ్యారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
mla kotamreddy sridhar reddy


తాజాగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కోటంరెడ్డి ఆస్పత్రిలో చేరారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. గత కొన్నిరోజులుగా ఆయనతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు కార్యకర్తలు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వరసగా రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.