యాప్నగరం

తూ.గో: బతికుండగానే బిడ్డను పాతిపెట్టి పరార్.. స్థానికులు బయటకు తీయగా..!

తూర్పు గోదావరి జిల్లాలో అప్పుడే పుట్టిన మగ శిశువును కొందరు దుండగులు పాతిపెట్టి పరారయ్యారు.

Samayam Telugu 5 Sep 2020, 7:18 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం కిష్టవరం గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన మగబిడ్డను బతికి ఉండగానే కొందరు దుండగలు పూడ్చి పెట్టారు. శిశువును పూడ్చిపెట్టిన విషయాన్ని గ్రామస్తులు గమనించి వెంటనే పూడ్చిన గొయ్యిని తవ్వి బయటకు తీసి చూడగా అదృష్టవశాత్తూ బిడ్డ బతికే ఉన్నాడు. దీంతో వెంటనే గ్రామస్తులు పసిబిడ్డను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
Samayam Telugu శిశువును కాపాడిన మహిళ


దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఏటపాక పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ విచారణకు ఆదేశించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం వైద్య సిబ్బంది సమీపంలో 5 గ్రామాల్లోని గర్భవతులను పరిశీలిస్తున్నారు. చిన్నారిని డెలివరీ ఎవరు చేశారన్న దానిపై విచారణ చేపట్టారు. పుట్టిన బిడ్డను ప్రీ మెచ్యూర్ డెలివరీగా అధికారులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.